మునుగోడు ఎన్నికపై బండ్ల గణేష్ హాట్ కామెంట్స్..కేసీఆర్ కు ఇదే !

-

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల వేదికలపై మాట్లాడిన స్పీచులు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడైతే రాజకీయాల్లోకి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తాయి. రాజకీయాల్లోకి దిగి.. కోటలు దాటే మాటలతో నవ్వుల పాలయ్యాడు. బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అనే స్థాయికి దిగజారిపోయాడు.

అదంతా కాసేపు పక్కకు పెడితే..మునుగోడు ఉప ఎన్నిక పై బండ్ల గణేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ పార్టీ పునర్జన్మను ఇచ్చే ఎన్నిక అన్నారు. మునుగోడులో బీజేపీ మూడో స్థానమేనని.. ఆ పార్టీ ప్రజలు తరమికొడతారని తేల్చి చెప్పారు. అక్కడ టీఆర్‌ఎస్‌ పార్టీకి, కాంగ్రెస్‌ పార్టీకి మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ కు సింగపూర్‌, దుబాయ్‌ కంటే ఎక్కువగా అభివృద్ధి చేశారని కేసీఆర్‌ ను కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news