ఏబిసిడి వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది – ఈటెల రాజేందర్

-

ఏబిసిడి వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కెసిఆర్ ను గద్దె దించడం కోసం అంతా కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. నేడు మాజీ మంత్రి చంద్రశేఖర్ ని కలిశారు ఈటెల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు ఈటెల. పార్టీలు మారడం అంటే బట్టలు మార్చినంత ఈజీ కాదని అన్నారు.

ఉద్యమ సమయంలో పదవులకు రాజీనామా చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. వరంగల్ రీజియన్ వరకే ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ జరిగిందని, అందుకే చంద్రశేఖర్ కి పాసు రాలేదని.. అంతే తప్ప ఇందులో మరొక ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే ఈటెల తనకు ఏమీ చెప్పలేదని, పార్టీని ఎలా బాగు చేయాలో తానే ఈటెలకు చెప్పానని అన్నారు చంద్రశేఖర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version