తెలంగాణ తల్లి కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల చేతిలో బందీ అయింది: కిషన్ రెడ్డి

-

టీాఆర్ఎస్ పార్టీ తన వైఫల్యాల నుంచి ప్రజలను మళ్లించేందుకు బీజేపీని విమర్శిస్తున్నారని… ఎనిమిదేళ్లుగా తెలంగాణలను కల్వకుంట్ల కుటుంబం శాసిస్తుందని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఓ వైపు కల్వకుంట్ల కుటుంబం, మరోవైపు ఓవైసీ కుటుంబం చేతిలో తెలంగాణ తల్లి బంధీ అయిందని విమర్శించారు. తెలంగాణ ద్రోహులు ప్రగతి భవన్ లో చేరారని.. నిజమైన తెలంగాణవాదులు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీాలో లేరని అన్నారు. ప్రభుత్వంలో ఉద్యమకారులు లేరని అన్నారు. తెలంగాణ మేధావులు, విద్యార్థులు టీఆర్ఎస్ పార్టీలో లేరని ద్రోహం చేసిన వారే ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీతో పొత్తుపెట్టుకుంటుదని విమర్శించారు. కొడుకును ఏరకంగా అయినా సీఎం చేయాలని బీజేపీపై కక్ష కట్టారని విమర్శించారు. పోలీసులు, మీడియాను శాసిస్తున్నారంటూ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరబోతోందని… తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ టెంటు, ఫ్రంట్ ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో నిజాం పాలన కేసీఆర్ కొనసాగిస్తున్నాడని విమర్శించారు. కరెంట్ మోటర్లకు మీటర్ల పెడుతారని, వడ్లకొనడం లేదని రైతులను టీఆర్ఎస్ మోసం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news