తెలంగాణ బిజెపి నేతలకు కేంద్రం బంపర్ ఆఫర్..రాజ్యసభకు ఒకరికి అవకాశం

-

తెలంగాణలో పార్టీ బలోపేతం పై బీజేపీ హైకమాండ్ సీరియస్ ఫోకస్ పెట్టింది.ఈ నేపథ్యంలో బిజెపి నేతలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఒకరికి అవకాశం లభించనుంది. ఉత్తరాది రాష్ట్రాల కోటా నుంచి ఎంపిక చేశారు. ఈ మేరకు మురళీధర్ రావు, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్లకు తుది గడువు ఈనెల 30 వరకు ఉంది. ఈ ముగ్గురిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకూ తెలంగాణాలో బీజేపీ నుంచి నేరుగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరూ లేరు. ఒకవేళ ఈ ముగ్గురు లో ఎవరైనా ఎన్నికైతే వీరే ప్రథమం అవుతారు. మరోవైపు జూపల్లి కి, సీఎం కేసీఆర్ కి పొసగడం లేదని భావిస్తున్న బీజేపీ వర్గాలు ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడం ఖాయమని చెబుతున్నాయి. ఆయన సేవలను పార్టీకి ఎలా వినియోగించుకోవాలని అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభకు నామినేట్ చేసే ప్రతిపాదన కూడా వచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బిజెపి ఆకర్ష్ ప్రయత్నాలకు రామేశ్వరరావు ఎటువంటి వైఖరి తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news