వంగి దండాలు పెడితే..కర్ణాటక ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు – సీఎం కేసీఆర్‌

-

బీజేపీ పార్టీపై మరోసారి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. కర్ణాటక లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని.. కర్ణాటకలో వంగి వంగి దండలు పెట్టిన ప్రజలు చంపి పడేశారని ప్రధాని మోడీకి చురకలు అంటించారు సీఎం కేసీఆర్‌. ఇండియాలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్‌.

గతంలో ఎమర్జెన్సీ వచ్చే ముందు ఎట్లా ఉందో …దేశంలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. ఢిల్లీ సీఎం తో సమావేశం అయిన అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కర్ణాటక ప్రజలు బిజెపికి బుద్ధి చెప్పారని.. కేంద్రం తీరు ప్రజ్వాస్వామ్యం కు ప్రమాదం అని వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం… ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ దారిలో ఉందని.. కేంద్రం ఆర్డినెన్సు ను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్లమెంట్ లో మా శక్తి మేరకు అడ్డుకుంటామని.. ఢిల్లీ ప్రజలను మోడీ సర్కార్ అవమానించిందని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news