BREAKING : ఈరోజు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ పర్యటన

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్… జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నాందేడ్ లో శిక్షణ తరగతులలో పాల్గొననున్నారు సీఎం కేసీఆర్. ఈ మేరకు అధికారులు, పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక తిరిగి రేపు హైదరాబాద్ ప్రయాణం కానున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. ఈ శిక్షణ తరగతులలో పార్టీని మహారాష్ట్రలో ఎలా ముందుకు తీసుకుపోవాలో.. నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. కాగా, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి పద్మమ్మ (92) మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version