కాంగ్రెస్ ఒక ముఠా చేతుల్లోకి వెళ్లింది : మంత్రి హరీష్ రావు

-

కాంగ్రెస్ ఒక ముఠా చేతుల్లోకి వెళ్లిందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత కరెంట్ ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ కాదా ? రేవంత్ రెడ్డి లాంటి చేతుల్లోకి పోతే రాష్ట్రం ఏమైపోతుంది. రేవంత్ రెడ్డికి అసలు హార్స్ పవర్ అంటే ఏంటో తెలుసా ? అని ప్రశ్నించాు మంత్రి హరీశ్ రావు. ఇలాంటి కాంగ్రెస్ మనకు అవసరమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లడం మంచిది కాదు అన్నారు. రైతు బంధు ఇస్తే బిచ్చం ఇస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కంటున్నారు.

కేసీఆర్ కృషి వల్ల రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది. తెలంగాణలో భూముల విలువ పెరిగిందంటే అందుకే కేసీఆర్ కృషి చాలానే ఉందని చెప్పవచ్చు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో కరెంట్ ను పోల్చుతున్నారు. కర్ణాటకలో రెండు, మూడు గంటల కంటే అధికంగా లేదని కుమరస్వామి ఇవాళే మీడియా ద్వారా వెల్లడించారు. కేసీఆర్‌ అంటే ఒక నమ్మకం.. భరోసా అని అన్నారు. కేసీఆర్‌ పాలనలో కరువు కాటకాలు లేవని చెప్పారు. పల్లెల్లో సాగునీటికి, హైదరాబాద్‌లో తాగు నీటికి ఇబ్బంది లేదన్నారు. కేసీఆర్‌ ముందు చూపుతో ప్రాజెక్టులు నిర్మించడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version