కాంగ్రెస్ నేత కుమారుడు గుండెపోటుతో మృతి

-

ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా 30 ఏళ్లలోపు వయసు ఉన్న యువకులు హార్ట్ ఎటాక్ తో క్షణాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గుండెపోటుతో ఓ కాంగ్రెస్ లీడర్ కుమారుడు చాలా చిన్న వయసులోనే మరణించడం అందరినీ కలిచివేసింది. ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నేత మానుకొండ రాధా కిషోర్ కొడుకు మానుకొండ శ్రీధర్ (31) గుండెపోటుతో మృతి చెందాడు.

సోమవారం ఉదయం జిమ్ కి వెళ్లిన శ్రీధర్ అక్కడ వర్కౌట్లు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నాడు. అలా ఇంటికి వచ్చి రాగానే గుండెపోటుకి గురయ్యడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శ్రీధర్ మరణించినట్లుగా డాక్టర్లు నిర్ధారించడంతో రాధా కిషోర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అయితే ఆదివారం ఉదయమే శ్రీధర్ కుమారుడి బారసాల కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రేణుక చౌదరి కూడా హాజరయ్యారు. ఆ మరుసటిరోజే శ్రీధర్ ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news