డిజిపి మహేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

-

తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ నేతలు. డీజీపీని కలిసిన వారిలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు విహెచ్, చిన్నారెడ్డి ఉన్నారు. తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ భారత్ జూడో పాదయాత్రకు భద్రత కల్పించేందుకు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. దీనిపై డిజిపి మహేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 24న కర్ణాటకలోని రాయచూర్ నుంచి తెలంగాణలోని మహబూబ్ నగర్ లోకి రాహుల్ ప్రవేశిస్తారని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్ ని డీజీపీకి అందజేసినట్లు తెలిపారు. పాదయాత్ర ముందుగా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ మండలం కృష్ణ గ్రామం వద్ద ఎంట్రీ ఇవ్వనుండగా.. మొత్తం 13 రోజులపాటు ఈ యాత్ర కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news