బీజేపీ నాయకులపై హైదరాబాద్ లో తిరుగుబాటు చేస్తాం – దానం నాగేందర్ వార్నింగ్

-

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో బండి సంజయ్, ఇతర బీజేపీ పార్టీ నాయకులు తిరిగితే తరిమికొడతాం అని… ఇంకోసారి సీఎం కేసీఆర్ పై వ్యాఖ్యలు చేస్తే.. బీజేపీ నాయకుల పై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

నిన్న టిఆర్ఎస్ దీక్షపై బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించిన దానం నాగేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణ ను చేసిన సీఎం కేసీఆర్ ను పట్టుకొని.. తప్పుగా మాట్లాడుతున్న బండి సంజయ్ అంతు చూస్తామని హెచ్చరించారు.

ఇక నుంచి టిఆర్ఎస్ పార్టీ సత్తా ఏంటో చూపిస్తామని వెల్లడించారు. బిజెపి ఒకటి అంటే… మేము రెండు అంటామని స్పష్టం చేశారు.బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముందు అన్నదాతలు వడ్లపోశారని… అన్నంపెట్టే వారికి సున్నం పెడితే ఇలాగే జరుగుతుందని ఆయన అన్నారు. వడ్లు కొనండి అంటే బీజేపీ నేతలు బెదిరస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news