టీఆర్‌ఎస్‌ను వీడే ఆలోచన లేదు: డిప్యూటీ స్పీకర్ పద్మారావు

-

టిఆర్ఎస్ సీనియర్ నేత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. టిఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్వయంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు స్పందించారు. తాను చివరి వరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని డిప్యూటీ స్పీకర్ పద్మారావు క్లారిటీ ఇచ్చారు. మంగళవారం రాత్రి హైదరాబాద్లో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో పద్మారావు భేటీ అయ్యారు.

ఈ భేటీలో తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి మరియు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే బుధవారం నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్ళనున్నట్లు కేటీఆర్ కు పద్మారావు తెలిపినట్లు సమాచారం అందుతోంది. తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో తప్పులు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ కు పద్మారావు వివరించినట్లు తెలుస్తోంది. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేశానని అలాగే ఉద్యమం కాలం నుంచి కేసీఆర్ తోనే ఉన్నాను.. ఇక ముందు కూడా అలాగే కొనసాగుతానని పద్మారావు స్పష్టం చేసినట్లు సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news