తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక.. ఆ డబ్బులు విడుదల

-

దీపావళి పండుగ నేపథ్యంలోనే కేసీఆర్‌ సర్కార్‌.. ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు జీతాలు విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటన చేసింది తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. సకల జనుల సమ్మె సమయంలో జీతాలు రాని వారికి రూ. 25 కోట్లు విడుదల చేస్తున్నామని బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు.

ఫెస్టివల్ అడ్వాన్స్ రూ.20 కోట్లు, ఎరియర్స్ రూ.20 కోట్లు చెల్లిస్తామని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపోతే… మునుగోడు ఉప ఎన్నిక ఉన్నందునే ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు వరాలు గుప్పిస్తోందని, ఎన్నిక అయిపోయాక వాళ్లను పట్టించుకునే నాధుడే ఉండడని బాజిరెడ్డి గోవర్థన్ పలువురు విమర్శిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చామని తెలిపారు బాజిరెడ్డి గోవర్థన్. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news