మునుగోడు ఉప ఎన్నికను బహిష్కరించిన వైఎస్‌ షర్మిల !

-

మునుగోడు ఉప ఎన్నికపై వైఎస్‌ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఉపఎన్నిక అహకారం, అధికారమదం కోసం వచ్చిన ఎన్నిక. ప్రజలంతా ఈ ఎన్నికను బైకాట్​ చేయాలని YSR తెలంగాణ పార్టీ పిలుపునిస్తుందని తెలిపారు వైఎస్‌ షర్మిల.. ప్రజల కోసం ఏనాడూ రాని నాయకులు.. ఓట్ల కోసం వస్తున్నారు. ప్రజలంతా ఈ ఎన్నికను బహిష్కరించాలని కోరారు షర్మిల.

అలాగే..నా గతం తెలంగాణలోనే. నా భవిష్యత్తు కూడా తెలంగాణలోనే. నేను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే. ఇక్కడే పెరిగా, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా. ఈ గడ్డ ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. సమస్యలను పట్టించుకోని పాలకపక్షం,స్వార్థం కోసం అమ్ముడుపోయిన ప్రతిపక్షాలు ఉన్నన్ని రోజులు అభివృద్ధి జరగదు. ఎల్లవేళలా ప్రజలపక్షాన నిలబడేది YSR తెలంగాణ పార్టీ మాత్రమేనన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news