తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక నిర్ణయం..!

-

తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే 8 పిటిషన్ల పై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించింది. అన్ని పిటిషన్ ల పై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించింది. 40రోజుల తక్కువ సమయంలో నిర్ణయం వెలువరిస్తున్నాం. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితిగతులు, వినియోగదారులు, ప్రభుత్వ సబ్సిడీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఎనర్జీ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదు అని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు పేర్కొన్నారు. స్థిర చార్జీలు రూ.10 యాదాతదం గా ఉంటుంది పౌల్ట్రీ ఫామ్ , గోట్ ఫామ్ లను కమిషన్ ఆమోదించలేదు.

ఇక Ht కేటగిరిలో ప్రతిపాదనలు రిజక్ట్ చేశాం. 132kva, 133kva, 11kvలలో గతంలో మాదిరిగానే ఛార్జీలు ఉంటాయి. లిఫ్ట్ ఇరిగేషన్ కు కమిషన్ ఆమోదించింది. టైమ్ ఆఫ్ డే లో పీక్ అవర్ లో ఎలాంటి మార్పు లేదు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలకు నాన్ పీక్ ఆవర్ లో రూపాయి నుంచి 1:50 రాయితీ పెంచాం. చేనేత కార్మికులకు హర్స్ పవర్ ను పెంచాం. Hp 10 నుంచి Hp 25కి పెంచాం. గృహ వినియోగదారులకు మినిమం చార్జీలు తొలగించాం. గ్రిడ్ సపోర్ట్ చార్జీలు కమిషన్ ఆమోదించింది. రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. రూ.1,800 కోట్లు ప్రపోజల్స్ ఇచ్చారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే.. ఈఆర్సీ రూ. 54,183.28 కోట్లు ఆమోదించింది అని చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version