తండ్రిలాంటి కెసిఆర్ ను ఈటెల విమర్శిస్తున్నారు – మంత్రి కేటీఆర్

-

నేడు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గులాబీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈటెల సొంత గ్రామం కమలాపూర్ లో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ పర్యటనను దగ్గర ఉండి పర్యవేక్షించారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్. కేటీఆర్ వెంట మంత్రి గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు.

ఈ సందర్భంగా జమ్మికుంటలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ కు రాజకీయ జన్మను ఇచ్చిందే సీఎం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. 14 నెలలలో కేంద్రం నుంచి ఈటెల ఒక్క రూపాయి అయినా తీసుకువచ్చారా? అనీ ప్రశ్నించారు. “కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని, నాకు మొత్తం తెలుసు అని, నేను ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశానని ఈటల రాజేందర్ మాట్లాడతారు.. ఈటెల రాజేందర్ నిజాయితీపరుడైతే నరేంద్ర మోడీ ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశారో చెప్పాలన్నారు. తండ్రిలాంటి కెసిఆర్ ను ఈటెల విమర్శిస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news