రేషన్ కార్డు దారులకు శుభవార్త..ఇవాళ్టి నుంచి ఉచితంగా 15 కేజీల బియ్యం

-

రేషన్ కార్డు ఉన్న వారికి శుభవార్త కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. ఆగస్టు మాసంలో ఒక్కొక్కరికి 15 కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆగస్టు 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లు తాజాగా ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో ఇవాళ్టి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఏప్రిల్ మాసం అలాగే మీ మాసాలలో ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందించలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే మరో ఐదు కిలోల బియ్యాన్ని కూడా ఉచితంగా ఇవ్వలేదు. దీంతో ఇవాళ్టి నుంచి ఆ మొత్తం 15 కేజీల చొప్పున బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఇవ్వనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news