గజ్వేల్ కాంగ్రెస్ లో మరోసారి బయటపడ్డ వర్గపోరు

-

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ మితిమీరిపోతోంది. తాము అధికారంలో ఉన్నామా..? లేదా..? అనే దానితో సంబంధం లేకుండా ఆ పార్టీలో వర్గ పోరు మాత్రం ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది. ఓవైపు కొత్త కొత్త లీడర్లను ఇతర పార్టీల నుండి చేర్చుకుంటూ జోష్ పెంచుతుంటే.. మరోవైపు వర్గపోరుతో ఆందోళనలు జరుగుతున్నాయి.

తాజాగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మరోసారి కాంగ్రెస్ నేతల మధ్య వర్గ పోరు బయటపడింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గజ్వేల్ పర్యటనలో వేరువేరుగా స్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు. ప్రజ్ఞాపూర్ వద్ద మంత్రికి స్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి.

ఇక ఒంటిమామిడి వద్ద మంత్రి తుమ్మలకి తన వర్గంతో స్వాగతం పలికారు మరో నేత శ్రీకాంతరావు. గతంలోనూ పార్టీ కార్యక్రమాలను వీరు వేరువేరుగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రుల పర్యటనలోనూ వీరు వేరువేరుగా స్వాగతం పలకడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version