కేసీఆర్ సర్కార్‌ కు కేంద్రం అదిరిపోయే శుభవార్త..ఆ 3 ప్రాజెక్టులకు గ్రీన్‌ సిగ్నల్‌

-

కేసీఆర్ సర్కార్‌ కు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. దీంతో తెలంగాణ సాగునీటి రంగంలో మరో ముందడుగు పడింది. మరో మూడు సాగునీటి ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపింది. కేంద్ర జల్ శక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన ఢిల్లీలో టిఏసి భేటీ జరిగింది.

కాగా, ఈ బేటిలో భూపాలపల్లిలోని ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం, నిజామాబాద్ లోని చౌటుపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతలతో పాటు ఆదిలాబాద్ లోని చనకా-కోరాట ఆనకట్టకు కేంద్ర జలశక్తి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి త్వరలోనే మినిట్స్ జారీ కానున్నాయి.

సెప్టెంబర్ 2021 లోనే కేంద్ర జల సంఘానికి, గోదావరి రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను అందించింది. కాగా, కేంద్ర జల సంఘంలో ఉన్న వివిధ డైరెక్టరేట్లు డిపిఆర్ లకు ఆమోదం తెలిపాయి. 3 ప్రాజెక్టులకు టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇవ్వవచ్చని కేంద్ర జల సంఘం సిఫారసు కూడా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news