త్వరలోనే ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షలు – హరీశ్ రావు

-

 

త్వరలోనే ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు.సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాల కార్యక్రమంలో హాజరై 45 మంది లబ్ధిదారులచే గృహా ప్రవేశాలు చేయించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు. అలాగే గ్రామ ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్, 750 ఏంటీ స్టోరేజీ గోదాము, డ్రాయింగ్ ప్లాట్ ఫామ్ లకు శంకుస్థాపన చేశారు.

 

అనంతరం గ్రామ జెడ్పీ హైస్కూలు పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం.సద్దితిన్న రేవు తలవాలి. నియత్ ఉంటేనే బర్కత్ ఉంటదనీ సంక్షేమ ఫలాలు పొందుతున్న లబ్ధిదారులను కోరారు. గత గజ్వేల్ పాలకులు సంజీవరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి హయాంలో జరగని అభివృద్ధి, సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశానికే ఆదర్శంగా గజ్వేల్ అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీలో ఇవ్వని కళ్యాణ లక్ష్మీ పథకం, మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఅర్ ఇస్తుండన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news