తెలంగాణ రైతులకు శుభవార్త..రైతు బంధుపై కీలక ప్రకటన !

-

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు బంధుపై కీలక ప్రకటన చేశారు మంత్రి హరీష్‌ రావు. రైతు బంధుపై ఏర్పాట్లు చేస్తున్నామని… అతి త్వరలోనే నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీంగల్ లో 35 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థానిక మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారితో కలిసి భూమి పూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ.. భీంగల్ ప్రజల్లో తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి ఉత్సాహం ఉండేదో ఇప్పుడు కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. భీంగల్ ప్రజల ప్రేమకు, అభిమానానికి నేనెప్పుడూ విధేయుడిని. ఉద్యమంలో కష్టపడి కొట్లాడిన గడ్డకు వంద పడకల ఆసుపత్రి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. బీజేపీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎనిమిది నెలల్లో హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.

కమిట్మెంట్ ఉన్న నాయకుడు ప్రశాంత్ రెడ్డి వల్లే బాల్కొండ భీంగల్ అభివృద్ధి చెందుతున్నది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నాయకుడు ప్రశాంత్ రెడ్డి. బీజేపీ-కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అచ్చే దిన్ కేవలం నోటిమాటకే పరిమితమైంది., ఏ ఒక్క హామీని మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజానీకాన్ని మోసానికి గురి చేసిన కేంద్ర ప్రభుత్వం, విదేశాల నుండి నల్లధనాన్ని వెనక్కి తెస్తామని నయాపైసా కూడా తేలేకపోయింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి హామీని నిలుపుకున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news