జై తెలంగాణ అనే వాళ్లను కాల్చి పడేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు

-

జై తెలంగాణ అనే వాళ్లను కాల్చి పడేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి.. అతనే ఇప్పుడు మన తెలంగాణ సీఎం అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరులో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నడు జై తెలంగాణ అనని వ్యక్తి రేవంత్ రెడ్డి.. అలాంటి వాడు సీఎం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు గోదావరి నీళ్ళు వచ్చి పంటలు పండితే ముద్ద తింటున్నామని.. ఇళ్ళు, ఇళ్ళు తిరిగి వాస్తవాలు చెప్పాలన్నారు. నోటి కాడ బుక్క పోగొడుతున్నారు. జమైన రైతు నేస్తం కేసీఆర్..మోసాలు చేసిన కాంగ్రెస్‌కు ఎలా ఓటు వేస్తారు అని ప్రశ్నించారు హరీశ్ రావు. దయచేసి మనం మోసపోవద్దు అని కోరుతున్నా. పేద విద్యార్థుల చదువు కోసం వంద కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తా అన్నారు వెంకట్రామిరెడ్డి. 30 రోజులు కష్ట పడితే ఇద్దరం కలిసి ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గులాబి జెండా కప్పుకున్న వాళ్ళే ఢిల్లీలో జై తెలంగాణ అంటారు. గులాంగిరి చేసేవాళ్ళు మనకెందుకు అన్నారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version