BREAKING : అసెంబ్లీ ప్రాంగణంలో భారీ ట్రాఫిక్ జామ్

-

హైదరాబాద్ లక్డికాపూల్ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. పండుగ ముగియడంతో ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్కు భారీగా చేరుకుంటునాయి ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, వాహనాలు. ఇక మరోవైపు నవరాత్రులు ముగియడంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అమ్మవారి విగ్రహాలు క్యూకట్టాయి. దీంతో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ అధికారులు.

ఇక అటు కురుస్తున్న వర్షాలకు వికారాబాద్ జిల్లా యలల్ మండలంలోని జుంటుపల్లి వాగు పొంగిపొర్లుతుంది. మండలంలోని యెక్కేపల్లి నుంచి పెర్కంపల్లి వెళ్లే గ్రామానికి వెళ్లే దారిలో బ్రిడ్జ్ పనులు కొనసాగుతుండడంతో పక్కనే తాత్కాలిక రహదారి నిర్మించినప్పటికీ వాగు ఉధృతికి పూర్తిగా తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. దీంతో యెక్కేపల్లి, పెర్కంపల్లి గ్రామాలకు మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి.రోజులు గడుస్తున్న కాంట్రాక్టర్ బ్రిడ్జి పనులను నత్త నడకన కొనసాగించడం తో పెర్కంపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయి.

Read more RELATED
Recommended to you

Latest news