బీజేపీ బిగ్ స్కెచ్..బండి సంజయ్ కు హెలికాప్టర్

-

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కాస్త వీక్‌ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న జోష్‌ ఇప్పుడు లేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీలో హుషారు పెంచేందుకు కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కమలం పార్టీ నిర్ణయించింది.

helicaptor to bandi sanjay

మాస్ లీడర్ ఇమేజ్ ఉన్న సంజయ్ తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు హెలికాప్టర్ కేటాయించింది. ప్రతిరోజు ఉదయం 11 గంటల వరకు తన సొంత నియోజకవర్గం కరీంనగర్ లో ప్రచారం చేసిన తర్వాత రెండు, మూడు నియోజకవర్గాలకు హెలిక్యాప్టర్ లో వెళ్ళనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో.. బీజేపీ పార్టీ ఇప్పటి వరకు మొదటి జాబితా మాత్రమే విడుదల చేసింది. ఇందులో 52 మంది పేర్లు మాత్రమే వచ్చాయి. దీపావళి లోపు పూర్తి స్థాయి జాబితా విడుదల చేయనుంది బీజేపీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version