హైదరాబాద్ మాన్యుఫాక్చరింగ్ రంగానికి అడ్డాగా మారబోతుంది: మంత్రి కేటీఆర్

-

మాన్యుఫాక్చరింగ్ రంగానికి హైదరాబాద్ అడ్డాగా మారుతోందని అన్నారు మంత్రి కేటీఆర్. హైటెక్ సిటీ హుడా టెక్నో ఎంక్లేవ్ లో జాన్సన్ కంట్రోల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటుచేసిన ఓపెన్ బ్లూ ఇన్నోవేషన్ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారత్ లో టాలెంట్ ఉన్న ఉద్యోగులకు కొదవ లేదన్నారు. వ్యాపార విస్తరణ చేయడంతోపాటు తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.

పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడులకు ఒకేఒక్క గమ్యస్థానం హైదరాబాద్ అని, ఇకపై దేశంలోని ఏ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జాన్సన్ కంట్రోల్ సంస్థ దశాబ్ద కాలంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నదని, హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో, రాష్ట్రంలో ఎన్ని వ్యాపార అవకాశాలు ఉన్నాయో, ఇక్కడ ఎంత సులభంగా వ్యాపారం చేయవచ్చో ఇప్పటికే అర్థమై ఉంటుంది అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టి-హబ్, టి-సెల్ హైదరాబాదులో ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news