కేసీఆర్ కి ధైర్యముంటే దారుసలాం కి తాళం వేయాలి – బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జెండా ఎగరవేయనందున సీఎం కేసీఆర్ కి ధైర్యం ఉంటే దారుసలాం కి తాళం వేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలలో ఎంఐఎం ఎందుకు పాల్గొనడం లేదో చెప్పాలని బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నిలదీశారు. అలాగే టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రేవంత్ రెడ్డి లాగా పార్టీలు మారడం, ఓటు కేసులో డబ్బులు పంచడం తనకు చేతకాదని విమర్శించారు. (RTI) కింద సమాచారం తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడం తనకు తెలియదని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపిస్తున్నారు ఆ పార్టీలోని సీనియర్ నేతలను అడిగితే తెలుస్తుందని అన్నారు. హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు డిపాజిట్లు రాలేదో ఆ పార్టీ నేతలు ప్రశ్నించుకోవాలని సూచించారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news