నీకు దమ్ము ఉంటే మా ఎమ్మెల్యే లను టచ్ చేసి చూడు : సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ కథలకు కాలం చెల్లిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మా ఎమ్మెల్యేలను ముట్టుకో చూద్దాం. ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న చల్లా వంశీ చందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వంశీ చందర్ రెడ్డితో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రచార రథం పైకి ఎక్కి స్పీచ్ ఇచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

రేవంత్ ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుంది. నేను హై టెన్షన్ వైర్ లాంటి వాడిని. ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి నాకు ఉంది. పాలమూరు అభివృద్ధి కావాలంటే రెండు సీట్లు గెలవాల్సిందే. అసెంబ్లీలో కారును బండకేసి కొట్టిండ్రు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారనే కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ నీకు దమ్ముంటే మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు. నేను హై టెన్షన్ వైర్ లాంటి వాడిని. ముట్టుకుంటే షాక్ కొడుతుంది. మనల్ని దెబ్బ తీయాలని బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయి. పాలమూరు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. రైతులు వలస పోతుంటే పట్టించుకోని మీరు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version