వరంగల్ లో విషాదం…చాక్లెట్ గొంతులో ఇరుక్కుని బాలుడి మృతి

-

వరంగల్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. విదేశీ పర్యటనకు వెళ్ళిన తండ్రి పిల్లలకోసం తీసుకువచ్చిన చాక్లెట్లు బాలుడి నిండు ప్రాణాలు బలితీసుకున్న సంఘటన వరంగల్ నగరంలోని పిన్నావారి వీధిలో శనివారం చోటు చేసుకుంది. వరంగల్ జేపీఎన్ రోడ్ పంజాబ్ నేషనల్ బ్యాంకు లేన్లో నివాసముంటున్న కన్హన్ సింగ్ గిత దంపతుల రెండవ కుమారుడు సందీప్ (8) స్థానిక పిన్నావారి వీధిలోని శారదా పబ్లిక్ స్కూల్లో రెండవ తరగతి చదుపుతున్నాడు సందీప్ తన సోదరుడు.

సోదరితో కలిసి అదే పాఠశాలలో చదువుకుంటున్నారు. శనివారం కన్హాన్ సింగ్ తన పిల్లలను స్కూల్ ద్విచక్ర వాహనం పై దింపి వెళ్ళే క్రమంలో ఇటీవలి విదేశాల నుంచి తీసుకువచ్చిన చాక్లెట్లను పిల్లలకు ఇచ్చారు. సందీప్ చాక్లెట్ తీసుకుంటూ పాఠశాలోని మొదటి అంతస్తులోని తన తరగతి గదికి వెళ్ళారు. సందీప్ చాక్లెట్ తింటూ కాసేపటికే తరగతి గదిలో సృహ్హ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం తండ్రికి సమాచారం అందించటంతో కన్హన్ సింగ్ పాఠశాలకు చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న సందీప్ ను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. బాలుడి గొంతులో చాక్లెట్ ఇరుక్కున్నట్లు వైద్యులు గుర్తించారు అపస్మారక స్థితిలో ఉన్న బాలుడు శ్వాస అందక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news