కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించిన జీవన్ రెడ్డి

-

జగిత్యాల జిల్లా: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో మార్పుకు సంకేతం అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల పై జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ, జేడీఎస్ ఎన్ని కుట్రలు పన్నిన కర్ణాటక ప్రజలు అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పలికారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

కర్ణాటక బీజేపీ ప్రభుత్వం కంటే తెలంగాణలో అవినీతి రెట్టింపు గా ఉందన్నారు జీవన్ రెడ్డి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోను కర్ణాటక ఫలితాలు పునరావృతం అవుతాయని జోష్యం చెప్పారు. ప్రభుత్వ అస్తులే కాకుండా.. కాంగ్రెస్ పాలనలో వేసిన జాతి సంపద, ఔటర్ రింగ్ రోడ్ ను అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పై విశ్వాసం ప్రకటించిన కర్ణాటక ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version