వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 85 సీట్లు రాబోతున్నాయి – ఏపీ జితేందర్ రెడ్డి

-

ఏపీ జితేందర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 85 అసెంబ్లీ రావడం ఖాయమని ఇంటెలిజెన్స్ సర్వేలో తేలిపోయిందన్నారు ఏపీ జితేందర్ రెడ్డి. బండి సంజయ్ నాయకత్వంలో గొల్లకొండ ఖిల్లాపై కాషాయ జెండాను ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇది తెలిసే బీజేపీలో గందరగోళం స్రుష్టించడానికే కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ యాడుంది? కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటే ప్రజలు ఓట్లేస్తారా? అని నిలదీశారు ఏపీ జితేందర్ రెడ్డి. దుబ్బాక, హుజూరాబాద్ , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెలువడే ఫలితాలే ఇందుకు నిదర్శనం చెప్పారు ఏపీ జితేందర్ రెడ్డి. 4 నెలల్లో రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీకి ఓట్లు గుద్దెందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఏపీ జితేందర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version