సీఎం కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం – కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్ అంత అవినీతి పాలన ఇప్పటి వరకు చూడలేదని.. కేసీఆర్ అరెస్ట్ కావడం మాత్రం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్‌. ఏడేళ్లలో 8లక్షల కోట్ల సొమ్ము ఏమైందో కేసీఆర్ చెప్పాలని.. రాకేష్ తికాయత్ నా శిస్యుడే..ఆయన్ను అడ్డం పెట్టుకోని కొత్త రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాశాంతి పార్టీ తరపున తెలంగాణ లోని అన్ని జిల్లాలు తిరుగుతానని.. తెలంగాణలో కేసీఆర్ ముక్త్ పాలన రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధి కొరకు 1982 నుంచి నేను కృషి చేస్తున్నా… బంగారు తెలంగాణ ఎక్కడ ఉంది..అప్పుల తెలంగాణ మాత్రమే మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి ఇప్పటి వరకు అన్ని రకాలుగా మద్దతు తెలిపి ఇప్పుడు విమర్శలు ఎందుకు చేస్తున్నారని.. కేసీఆర్ నన్ను కలిశారు ఆశీస్సులు తీసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు కూడా కెసిఆర్ గెలువడని.. ఆంద్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్ళిపోయిందని మండి పడ్డారు. మరో 20 ఏళ్ళు ఎవరు పాలన చేసినా ఇబ్బందులేనని.. 18 పార్టీల నేతలు నేను కలిసి ఆగస్టు నెలలో సమావేశం పెట్టామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news