కోమటిరెడ్డి నోరు మూసీ నది కన్నా అధ్వాన్నం – కంచర్ల భూపాల్ రెడ్డి

-

కోమటిరెడ్డి నోరు మూసీ నది కన్నా అధ్వాన్నం ఉందని ఫైర్‌ అయ్యారు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ… కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నోరు మూసీ నది కన్నా అధ్వాన్నంగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో మూసీ నది ఏ విధంగా ఉండేదో రైతులను అడిగితే తెలుస్తుందని….మూసీకి కాలుష్యం లేకుండా నీళ్లను బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిందని వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతంలో పంటలు
పండుతున్నాయన్నారు.

Kancharla Bhupal

కోమటిరెడ్డి తాగి ఏం మాట్లాడతారో తెలియదు… కోమటిరెడ్డి సోదరులు నల్గొండ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. కాంగ్రెస్ వదిలేసిన ప్రాజెక్టులను బిఆర్ఎస్ పూర్తి చేసిందని… కోమటిరెడ్డి అనుచరులు సబ్ స్టేషన్ పరికరాలను అమ్ముకున్నారన్నారు. కోమటిరెడ్డి స్వంత ఊరు బ్రాహ్మణ వెల్లంల సబ్ స్టేషన్ మాయమైందని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా కోమటిరెడ్డి ఏం చేస్తున్నారో చెప్పాలని… కోమటిరెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే,మంత్రిగా
పనిచేసి నల్గొండను పట్టించుకోలేదని ఫైర్‌ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version