మోదీ వస్తున్నారని కెసిఆర్ పరార్ అవుతున్నారు – ఈటెల రాజేందర్

-

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నేడు ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు రామగుండానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో.. నేడు రాత్రికి ఢిల్లీకి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ పయనం కానున్నారని సమాచారం. నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్ దాదాపు నాలుగు రోజులపాటు ఢిల్లీలోనే ఉండి పలువురు నేతలను కలవనున్నారని సమాచారం. ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రోడ్డు మార్గాన తిరుగు ప్రయాణం కావాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారట.

అయితే ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తుంటే సీఎం కేసీఆర్ పరారవుతున్నారని ఏద్దేవా చేశారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. అబద్దాల పునాదుల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. సొంత పార్టీ మంత్రుల ఫోన్లలో సీఎం కేసీఆర్ టాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదన్నారు. కమ్యూనిస్టులను రెచ్చగొట్టి ప్రధాని పర్యటనను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ ప్రయత్నించడం సరికాదన్నారు ఈటెల రాజేందర్.

Read more RELATED
Recommended to you

Latest news