పవర్‌ కట్స్‌ ఉండకూడదు..భారీ వర్షాలపై కేసీఆర్‌ సర్కార్‌ ఆదేశాలు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్లచేపట్టాల్సిన జాగ్రత్తలు, వర్షాల అనంతరం అంటువ్యాదులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలపై నిర్వహించిన ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్ మాట్లాడుతూ, గత రాత్రి నుండి తిరిగి భారీ వర్షాలు కురుస్టున్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తతతో ఉండాలని ఈ సందర్భంగా సీఎస్‌ సోమేష్‌ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం ఏర్పడకుండా చర్యలు చేపట్టాలి. అన్ని శాఖల అధికారులు సహయ పునరావాస కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.


వికారబాద్ జిల్లాలొ భారీ వర్షాలతొ భాటీ వరదలు ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్ జలాశయాలకు అధికంగా వచ్చే అవకాశం ఉంది. జీహెచెంసి, జలమండలి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. అన్నిజిల్లాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రిజర్వాయర్లు, చెరువులు పూర్తిగా నిండినందున చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు.

రాష్ట్రంలొ అన్ని ప్రాంతాల్లొ విద్యుత్ సరఫరా కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాం… ఎక్కడైతే రహదారులు, బ్రిడ్జిలు తెగాయో, ఆమార్గాల్లో ప్రమాదాలు జరగకుండా వాహనాలను, ప్రయానీకులను నిలిపి వేయాలి. ఆయా ప్రాంతాలలో ప్రయానించకుండా తగు పోలీస్ బందోబస్తు చేయాలని పేర్కొన్నారు. పోలీసు, నీటి పారుదల, రోడ్లు భవనాలు, విధ్యుత్, రెవిన్యూ తదితర శాఖల లన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news