ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

-

నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం తో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సీఎం కేసీఆర్, పార్టీ నేతలు నివాళులు అర్పించారు.

అయితే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెప్పారు. సర్వేలన్ని బిఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయన్న కేసీఆర్.. ప్రజల్లోకి వెళ్లేలా నేతలు పాదయాత్రలు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news