తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం..15 నిమిషాల ముందు కూడా !

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ మరో కీలక నిర్ణయ తీసుకుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 600 బస్సులలో ఐ టీమ్స్ అనే ఈ నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టగా, త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులలో దీనిని ప్రవేశపెట్టాలని తాజాగా టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

అన్ని సిటీ బస్సులతోపాటు జిల్లాలకు వెళ్లే సర్వీసులలో కూడా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఆన్లైన్ లో వెబ్సైట్ లేదా యాప్లలో బస్సు బయలుదేరే గంట ముందే బుకింగ్స్ క్లోజ్ అవుతాయి. కానీ ఐ టీమ్స్ మిషన్ల ద్వారా తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులు కౌంటర్ల వద్ద టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం కారణంగా.. ప్రయాణికులు దూర ప్రయాణాలకు సులభంగా వెళతారు.

Read more RELATED
Recommended to you

Latest news