బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదు.. రా రైస్ నే కొంటాం – కిషన్ రెడ్డి

-

బాయిల్డ్ రైస్ ఎవరూ తినడం లేదు.. రా రైస్ నే కొంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిఎం కేసీఆర్ అవలంబిస్తున్న వైఖరి, వితండ వాదం, విచిత్రంగా ఉందని.. కేంద్రం వ్యవసాయ పంపు సెట్లకు మోటార్లు పెడుతున్నారని, ఉద్యమం అన్నారని అగ్రహించారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత మీటర్ల పేరుతో నానా హంగామా చేశాడని.. మీటర్లు పెట్టె విషయంలో కేంద్రము ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని రైతులు అర్ధం చేసుకున్నారని పేర్కొన్నారు.

వడ్లపై లేని సమస్యను ఉన్నట్లుగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసి ఇచ్చింది వాస్తవం కాదా..? అని నిలదీశారు. రైతుల మెడ మీద కేసీఆర్ కట్టి పెడుతున్నారు.. బాయిల్డ్ రైస్ ఎక్కడా తినడం లేదన్నారు. అందుకే బాయిల్డ్ రైస్ వచ్చే పంట వేయకుండా అప్రమత్తం చేశామని వెల్లడించారు. నిన్నటి ధర్నాలో లేని విషయాలను వక్రీకరించి చెప్పారని.. గత సీజన్ గురించి మాట్లాడిన నా మాటలు వక్రీకరించి చూపెట్టాడని మండిపడ్డారు. కేంద్రం చేసుకున్న అగ్రిమెంట్ మేరకు రా రైస్ ను చివరి గింజ వరకు కొంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news