అధికారంలోకి వస్తే..హైదరాబాద్ పేరు మారుస్తామన్న బీజేపీ..కేటీఆర్ ఘాటు రిప్లై

-

హైదరాబాద్ : బీజేపీ అధికారంలోకి వస్తే..హైదరాబాద్ పేరు మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు జార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్ దాస్. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు రఘుబర్ దాస్. అయితే.. బీజేపీ నేతలకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఘాటు రిప్లై ఇచ్చారు.

బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామన్న ఆ పార్టీ నేత రఘుబర్ దాస్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మీరు అహ్మదాబాద్ పేరును ముందుగా ఆదానిబాద్ అని ఎందుకు మార్చరు అని బీజేపీ నేతను ప్రశ్నించారు కేటీఆర్. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news