కేటీఆర్..‘‘విత్ డ్రాయల్ సిమ్టమ్స్’’తో బాధపడుతున్నాడు – బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పై బండి సంజయ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ ‘‘విత్ డ్రాయల్ సిమ్టమ్స్’’తో బాధపడుతున్నాడు. అందుకే పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడని ఆగ్రహించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడన్నారు.

ఇవాళ సిరిసిల్ల, వేములవాడలలో జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ సెస్ ను భ్రష్టుపట్టిస్తున్న బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పి, బిజెపి బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని కోరాను. ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడి వాడి మానేసిండు కదా…. ‘‘విత్ డ్రాయల్ సిమ్టమ్స్’’ ఉంటయ్. ఏదైనా వ్యసనముండి అకస్మాత్తుగా మానేస్తే కొద్దిరోజులు పిచ్చిపచ్చిగా ఉంటుంది కదా… ట్విట్టర్ టిల్లు కూడా అట్లనే ఉన్నడు.. పచ్చిపిచ్చిగా వాగుతున్నాడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

కేటీఆర్… మీరిచ్చిన హామీలన్నీ అమలు చేయండి. అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వండి. దళితులకు మూడెకరాలు ఇవ్వండి. పోడు భూముల సమస్య పరిష్కరించండి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలివ్వండి. రైతులకు రుణమాఫీ చేయండి. ప్రజా సమస్యలన్నీ పరిష్కరించండి. అప్పుడు నా తల నరకండి. ప్రజల కోసం నరికించుకోవడానికి, చెప్పుతో కొట్టించుకోవడానికి సిద్దంగా ఉన్నా….!తెలంగాణ మాదిరిగా దేశమంతా అభివృద్ధి చెందాలని కేసీఆర్ అంటున్నాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news