BREAKING : రేపు బీజేపీలో మర్రి శశిధర్‌రెడ్డి చేరిక

-

ఢిల్లీ: రేపు బీజేపీ పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు మర్రి శశిధర్‌రెడ్డి. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తిగా ఉన్న మర్రి శశిధర్‌రెడ్డి… రేపు బీజేపీలో చేరనున్నారు.

దీనిపై బీజేపీ పార్టీ కూడా అధికారిక ప్రకటన చేసింది. కాగా, ఇటీవల.. కాంగ్రెస్‌ పార్టీకి మర్రి శశిధర్‌రెడ్డి… రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు కూడా చేశారు మర్రి శశిధర్‌రెడ్డి. తెలంగాణ బాగు కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్​తో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుందని.. ఈ విషయం ప్రజల్లో బాగా పాతుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీ విఫలమైందని ఆయన ఆక్షేపించారు.

Read more RELATED
Recommended to you

Latest news