కేటీఆర్ దత్తతతో మునుగోడుకు ఇక ఢోకా లేదు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

రాష్ట్ర మంత్రి కేటీఆర్ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇక మునుగోడుకు ఏం ఢోకా లేదని.. ఈ నియోజకవర్గానికి ఇక తిరుగుండదని తెలిపారు. ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజీగూడెంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీఆర్‌ఎస్‌ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు తమను ఎక్కడ తరుముతారోనని భయపడి ప్రచారం చేపట్టేందుకు ప్రతిపక్షాలు జంకుతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఓట్లు అడిగేందుకు వెళ్తే ఎక్కడ కొడతారోనని ప్రతి పక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధి చేసేవాళ్లు అధికారంలోకి రావాలో.. కులం మతం పేరిట చిచ్చు పెట్టే వారు కావాలో ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయాలని ఓటర్లకు మంత్రి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news