కేటీఆర్ త్వరగా కోలుకోవాలని మోకాళ్లపై గుడి మెట్లు ఎక్కిన ఎమ్మెల్యే రాజయ్య

-

తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైన విషయం తెలిసిందే. మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కు వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి విధితమే. అయితే ఇటీవల కేటీఆర్ త్వరగా కోలుకోవాలని టిఆర్ఎస్ మహిళా నేతలు పూజలు నిర్వహించారు.

మహబూబ్నగర్ జిల్లాలోని ముత్యాలమ్మ దేవాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, జడ్పీ చైర్మన్ బిందు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే తాజాగా కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిలుపూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తాటికొండ రాజయ్య మోకాళ్లపై ఆలయ మెట్లు ఎక్కి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news