మునుగోడు కాంగ్రెస్ లో ముసలం..ఆడియో లీక్ !

-

ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ మొత్తం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో ప్రధాన పార్టీలన్నీ బైపోల్ వ్యూహాలకు పదును పెట్టే పనిలోపడ్డాయి. ఇక ఉప ఎన్నికపై ఏం చేయాలనే దానిపై కాంగ్రెస్ కసరత్తు మొదలు పెట్టింది. ఓవైపు రాజగోపాల్ రెడ్డి రాజీనామా వచ్చిన క్షణాల్లోనే.. ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రకటన విడుదల చేసింది కాంగ్రెస్.

అయితే మునుగోడు నుంచి టికెట్ ఆశిస్తున్న చల్లమల్ల కృష్ణారెడ్డికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తున్నట్టు మునుగోడులో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి రెడ్డి, ఓ కార్యకర్త మధ్య జరిగిన సెల్ ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మునుగోడు టికెట్ విషయంలో చల్లమల్ల కృష్ణారెడ్డికి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో లోపాయి గారి ఒప్పందం కుదిరినట్లు ఓకార్యకర్త స్రవంతికి చెబుతున్నట్లు ఆడియోలో రికార్డ్ అయింది. దీంతో కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి హుజరాబాద్ లో వచ్చిన ఫలితాలే ఇక్కడ వస్తాయని అన్నట్లుగా సంభాషణ సాగింది. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news