జూబ్లీహిల్స్ దోపిడీ కేసులో కొనసాగుతున్న విచారణ

-

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ప్రముఖ వ్యాపారవేత్త ఎమ్మెస్ఎన్ రాజు ఇంటిలో జరిగిన దోపిడీ కేసులో విచారణ కొనసాగుతోంది. రాజు భార్యను, కూతుర్ని బంతిగా పెట్టుకొని 10 లక్షలు దోచుకున్నాడు ఓ దొంగ. ఫుల్లుగా మద్యం సేవించి కేవలం 10 లక్షలు మాత్రమే చోరీ చేశాడు. ఇంట్లో ఉన్న బంగారం, వజ్రాలను మాత్రం టచ్ కూడా చేయలేదు.

తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన దొంగ.. 8 గంటల పాటు తల్లి, కూతుర్లని బందిగా పెట్టుకొని.. దోచుకున్న డబ్బులతో కూతురు సెల్ఫోన్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాడు. షాద్ నగర్ బస్ స్టాప్ వరకు క్యాబ్లో వెళ్లినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆ దొంగ హిందీ, ఇంగ్లీష్, తెలుగు స్పష్టంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజు కూతురి మెడ పైన కత్తి పెట్టీ లీటర్ వైన్ ని తాగినట్లు విచారణలో వెళ్లడైంది.

లక్షల రూపాయల బంగారు ఆభరణాలు తనకు వద్దని వారికి తెగేసి చెప్పాడట ఆ దొంగ. తనకు 20 లక్షల రూపాయలు ఇస్తేనే ఎవర్ని చంపకుండా వదిలిపెడతానని చెప్పాడట. డబ్బులు లేకపోవడంతో తన భర్త ద్వారా బయట నుంచి డబ్బులు తెప్పించి ఇచ్చింది కూతురు. ముసుగు వేసుకొని ఇంట్లోకి చొరబడిన దొంగను పట్టుకునేందుకు పది టీములతో గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఇలాంటి విచిత్రమైన చోరీ జరగడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version