రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూప్పకూలబోతుంది – పల్లా సంచలనం

-

తెలంగాణలో 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ కేవలం 39 సీట్లకే పరిమితం అయింది. ఈ తరుణంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి పడిపోతుందని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వాక్యాలు చేశారు. అధికారం కోల్పోయామని పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని కోరారు.

ఎన్ని రోజులు పడుతుందో తెలియదు గానీ వచ్చే ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు వారికి వారే ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారని వాక్యానించారు. తమ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి.

ఇటీవలే  స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి సంచలన వాక్యాలు చేశారు. మరో ఆరు నెలలు లేదా ఏడాదిలో కేసీఆర్ మరల సీఎం అవుతారని వాక్యానించారు. పూర్తి ఆదిక్యంతో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో కడియం శ్రీహరి చేసిన వాక్యాలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version