తెలంగాణలో మూడోవంతు స్థానాల్లో పోటీ చేస్తాం – పవన్‌ కళ్యాణ్‌

-

తెలంగాణలో మూడోవంతు స్థానాల్లో పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఇవాళ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్… చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఐదులక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… సామాజిక మార్పు మాత్రమే నా లక్ష్యమని.. ఆంధ్రలోనే అధికారం ఆశించలేదు.. తెలంగాణలో అధికారం ఎలా ఆశిస్తానన్నారు.

వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకమని స్పష్టం చేశారు పవన్‌ కళ్యాణ్‌. రాజకీయాల్లో కొత్త తరం రావాలి…ఓటమికి కుంగిపోనని పేర్కొన్నారు. తెలంగాణలో మూడోవంతు స్థానాల్లో పోటీచేస్తామని.. తెలంగాణ లో గెలుపు ఓటమిని జనసేన ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 6 వేల ఓట్లు మకున్నాయని స్పష్టం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news