తెలంగాణ ప్రజలకు శుభవార్త..త్వరలోనే పింఛన్లు, రేషన్‌ కార్డులు మంజూరు

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు మంత్రి. త్వరలోనే పింఛన్లు, రేషన్‌ కార్డులు మంజూరు అవుతాయని ప్రకటించారు. ఇప్పటికే వీటిపై సీఎం కేసీఆర్‌ ఆమోద ముద్ర వేశారని.. త్వరలోనే.. అర్హులందరికీ.. మంజూరు అవుతాయని ప్రకటించారు మంత్రి కేటీఆర్‌. ఇవాళ మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్లా జిల్లాలో పర్యటించారు.

ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ… 3 నెలలు ప్రణాళిక బద్దంగా కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని యూత్‌ కు సలహాలు ఇచ్చారు. జీవితం చాలా పెద్దది, అపజయం ఎదురైతే బేజారు కావొద్దని సూచించారు. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే ప్రైవేట్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ప్రతి పాదిక నీళ్ళు, నిధులు, నియామకాలు అన్నారు. 8 ఎండ్లలో సాగునీటి రంగలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తి పోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news