తెలంగాణకు ప్రధాని మోడీ.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణకు ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ స్వాగతం పలుకుతోందని చెప్పారు. తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. బడ్జెట్ లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరుతున్నామని వివరించారు.

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ‘కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎం’ అని బీజేపీ లీడర్లు బుకాయిస్తున్నారు కానీ ఎంక్వైరీ చేయడం లేదు. YSR తెలంగాణ పార్టీ కాళేశ్వరం అవినీతిపై ఢిల్లీకి వెళ్లి పోరాటం చేసింది. కాగ్, సీబీఐకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలులేవన్నారు. మీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరం. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఎదురెళ్లి సమస్యలు పరిష్కరించండి అని నిలదీసే దమ్ము దొర గారికి లేదు. చేతకాని దద్దమ్మలా ఫామ్ హౌజ్ కే పరిమితమై, ప్రధాని వెళ్లిపోయాక అవాకులు, చెవాకులు పేల్చడం కేసీఆర్ గారికి అలవాటుగా మారింది. దొర గారి రాజకీయాలు, మొండి వైఖరితో తెలంగాణకు అన్యాయమే జరుగుతోందని వెల్లడించారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news