నేనెవరో తెలియాలంటే గూగుల్ లో సెర్చ్ చేయండి: కేఏ పాల్

-

తెలంగాణ రాష్ట్ర పోలీసులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.తాను ఎవరో తెలియదు అంటూ వరంగల్ నగర కమిషనర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.తాను ఎవరో తెలియాలంటే గూగుల్ సెర్చ్ చేయాలని సూచించారు.ఈనెల 6 వ తేదీన హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టుకునేందుకు తమ పార్టీ అనుమతి కోరగా అనుమతి ఇవ్వలేదని కేఎ పాల్ ఆరోపించారు.ఓటు బ్యాంకు లేని రాహుల్ గాంధీకి మాత్రం అనుమతి ఇచ్చారని ఆయన మండిపడ్డారు.

రైతుల కోసం సభ నిర్వహించి ఉద్యమం చేస్తున్నందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడి తమ పార్టీ సభకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.పైగా, తన సభకు అనుమతి ఇవ్వొద్దంటూ హైదరాబాద్, వరంగల్ కమిషనర్లను సీఎం కేసీఆర్ బెదిరించారని ఆరోపించారు.బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల సర్కారు చేసిందన్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, నిరుద్యోగులకు అండగా పోరాడుతామని కేఎ పాల్ ప్రకటించారు.నిన్నగాక మొన్న రాహుల్ సభకు అనుమతి ఇచ్చి తనకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news