రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోయే యాత్ర అవుతుంది – రేవంత్ రెడ్డి

-

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయే యాత్ర అవుతుందని ధీమా వ్యక్తం చేశారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్లోని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ నివాసంలో భారత్ జోడో యాత్ర గురించి చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత్ జోడోయాత్ర తెలంగాణలో దాదాపు 13 రోజులు ఉంటుందన్నారు. తెలంగాణ తర్వాత రాహుల్ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని అన్నారు.

ఈనెల 24వ తేదీ నుంచి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలవుతుందని ఆయన తెలిపారు. యాత్రను సమన్వయం చేసుకునేందుకు మహారాష్ట్ర నేతలు రావడం సంతోషంగా ఉందన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ నేతలు కలిసి కర్ణాటక యాత్రను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాహుల్ గాంధీ యాత్రకు పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని.. చరిత్రలో నిలిచిపోయే యాత్ర అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో ప్రజలు కూడా రాహుల్ యాత్రలో పాల్గొన్నామని చెప్పుకునే విధంగా చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news