మంత్రి కేటీఆర్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాదగిరిగుట్టలో ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అయితే కోర్టులు, చట్టాలు అవసరం లేదని అన్నారు. రేపిస్టులను సన్మానించిన చరిత్ర బీజేపీదని.. అలాంటి వాళ్ళ ప్రమాణాలకు విలువ ఏముంటుందని అన్నారు.

అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో దేవుడిని తాకడం అంటే పాపం అని అన్నారు. పవిత్రమైన దేవుడి సన్నిధిని సంప్రోక్షణ చేయాలని వేదపండితులకు, అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ యాదాద్రి గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేస్తే.. గుడిని సంప్రోక్షణ చేయాలని కేటీఆర్ కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అక్రమ డబ్బు సంపాదించి కేటీఆర్ మదమెక్కి ప్రవర్తిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే అయ్యా కొడుకులకు ఇద్దరికీ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news